UPDATED 5th SEPTEMBER 2017 TUESDAY 9:00 AM
కడియం: తూర్పుగోదావరిజిల్లా కడియం మండలం కడియపులంక పల్లవెంకన్న నర్సరీలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మొక్కలతో అద్భుతమైన సందేశాన్ని కూర్పుచేశారు. విద్యావృక్షమే గురువు గురుదేవోభవ అని పేర్కొంటూ మొక్కలతో వృక్షాన్ని, వృక్షం కొమ్మలపై తెలుగు అక్షరాలతో గురువు ప్రాధాన్యతను చాటిచెప్పారు. ఇలా ప్రతి పండుగను తమదైన శైలిలో మొక్కలతో సందేశాన్ని ఇస్తున్న పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యాన్ని పలువురు అభినందించారు.







