UPDATED 12th JUNE 2018 TUESDAY 9:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో ఇంజనీరింగ్ చేరిన విద్యార్థులకు ఈ నెల 14 నుంచి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన విద్యార్థులకు 15నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులతో ఉదయం పది గంటలకు సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.







