గంగవరం (రెడ్ బీ న్యూస్) 21 నవంబర్ 2021: గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. కృష్ణ అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు పురస్కరించుకుని ఆదివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అవసరమయ్యే పలు పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన చేతులమీదుగా బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సత్యవతి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







