పెద్దాపురం,11 అక్టోబరు 2020(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ శివారు గాలిబంగ్లా ప్రాంతంలో
ఆదివారం సాయంత్రం గొర్రెల మందపైకి ఇండికా కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 గొర్రెలు వరకూ అక్కడిక్కడే మృతి చెందాయి. పట్టణానికి చెందిన గొర్రెల పెంపకందారుడు ఆల్సి లక్ష్మణ్ (లచ్చి) తన గొర్రెలను మేతకు తీసుకువెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి తోలుకు వస్తుండగా అటువైపు వస్తున్న టాటా ఇండికా కారు అదుపుతప్పి గొర్రెల మందమీదకు వేగంగా దూసుకుపోయింది. దీంతో గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. తన జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో పెంపకందారుడు లక్షణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







