UPDATED 11th MARCH 2020 WEDNESDAY 8:30 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి హుండీల ఆదాయాన్ని దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, సిబ్బంది, భక్తజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. మహా శివరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం గత మూడు నెలల 6 రోజులకి సంబంధించి లెక్కించగా రూ.10,59,933 ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరం మహా శివరాత్రి మూడు నెలల కాలానికి రూ.8,82,234 ఆదాయం రాగా, ఈ ఏడాది ఆదాయం రూ.1,77,699 ఆదాయం పెరిగినట్లు ఈవో పేర్కొన్నారు.







