UPDATED 21st AUGUST 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: సౌరశక్తి, పవన శక్తి వంటి అనేక తరగని వనరులను వినియోగించుకుంటే మానవాళికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల గ్రీన్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో తరగని వనరుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బయోగ్యాస్, భూగర్భ జలాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, ఏ.ఎల్.వి. కుమారి, రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.







