గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు మంగళవారం ప్రారంభించారు. ఈదీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం భీమా పాలసీని రద్దు చేసిందని, ప్రభుత్వం వెంటనే గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి చనిపోయిన ఆశ కార్యకర్తలకు రూ. 10 లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకుండా గంగవరం మెడికల్ ఆఫీసర్ అడ్డుకుంటున్నారని ఆశా వర్కర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ధర్నాలకు వెళితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లపై వేధింపులను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది అన్నారు. గత నెల 23న చనిపోయిన చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్న ఆశావర్కర్లపై మెడికల్ ఆఫీసర్ వేధింపులు సరికాదన్నారు. మారుమూల గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతిక్షణం ప్రమాదంతో ప్రయాణం చేస్తున్న ఆశా వర్కర్లకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చనిపోయిన నలుగురు ఆశా వర్కర్లకు న్యాయం జరిగే వరకు ఆశా వర్కర్లకు గిరిజన సంఘం అండగా ఉంటుందని అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి కార్యకర్తల నాయకులు మంగమ్మ, మార్తమ్మ తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







