గంగవరం: 3 ఆగస్టు 2020(రెడ్ బీ న్యూస్): ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ బాబు పేర్కొన్నారు. గంగవరం మండలం కొత్తాడ కస్తూర్భా విద్యాలయంలో రూ. 1.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణ పనులను వారు సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్య అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, కస్తూర్భా బాలికల విద్యాలయం అప్ గ్రేడ్ చేస్తూ కళాశాల స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. కళాశాల కోసం భవన సదుపాయం సర్వ శిక్ష అభియాన్ నిధుల ద్వారా భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. బాలికా విద్యను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఏజెన్సీలో అనేక ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలను నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలను గతం కంటే మెరుగ్గా తీర్చడం జరుగుతుందన్నారు. విద్యుదీకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కస్తూర్భా బాలికల విద్యాలయంలో అమలు జరుగుతున్న నాడు-నేడు పనులను అనంతరం వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో ఆంగ్లంలో అమలు జరుగుతున్న నాడు నేడు పనులపై మండల విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు ఎమ్మెల్యేకు వివరించారు. నాడు నేడు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీవో జాన్ మిల్టన్ ప్రత్యేక అధికారి పద్మావతి. అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్.ఐ షరీఫ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అప్పలరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







