ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021‌: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన కంపెనీ.. బ్యాంకును మోసం చేసిన అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నంది గ్రెయిన్‌ డెరివేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కంపెనీ డైరెక్టర్లు సురేష్‌ కుమార్‌ శాస్త్రి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఎం.శశిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌పై హైదరాబాద్‌ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. రుణాల పేరిట రూ.61.86 కోట్లు మోసం చేశారంటూ బ్యాంక్‌ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. తప్పుడు పత్రాలు, వివరాలు సమర్పించి నంది గ్రెయిన్‌ డెరివేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రుణాలు పొంది, వాటిని ఇతర అవసరాలకు మళ్లించి వ్యక్తిగత లబ్ధి పొంది.. ఆ తర్వాత ఎగవేశారని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆరోపణ. దివంగత ఎస్పీవై రెడ్డితో పాటు సురేష్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, శశిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పేర్కొంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌, నంద్యాలలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us