UPDATED 5th JANUARY 2018 FRIDAY 8:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించిందని ఆదిత్య ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్ తెలిపారు. విద్యార్థులు ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రక్తపోటు పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు తెలియచేశారు. అలాగే బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో 230 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.







