UPDATED 17th MARCH 2018 SATURDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజుల పాటు వివిధ అంశాలపై ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విస్తరణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ ఎన్.వి.ఎస్.ఎస్ మూర్తి అన్నారు. ఈ సందర్భంగా శిక్షణను పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు టి.ఎల్.ఎన్. కుమార్ రాజా, జె. రాంబాబు, డి. రామ్మోహనరావు, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.







