UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: చంద్రన్నబీమా పాలసీదారు దేశంలో ఎక్కడ చనిపోయినా బీమా వర్తిస్తుందని కానీ విదేశాలకు వెళ్లి అక్కడ చనిపోతే మాత్రం వర్తించదని డి.ఆర్.డి.ఎ పిడి ఎస్. మల్లిబాబు అన్నారు. స్థానిక టిటిడిసిలో బుధవారం బీమా మిత్రాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలసీదారులు ప్రమాదంలో మరణించిన సమయంలో మాత్రం రూ. పది లక్షలు క్లెయిమ్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర కమిటీ డైరెక్టర్ రాజశేఖర్, ఆపరేషన్ మేనేజర్ ఎం. రంగారావు, సెర్ఫ్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.డి. విజయకుమారి, బీమామిత్రలు, తదితరులు పాల్గొన్నారు.







