రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ప్రజాసమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ భరత్రామ్ తెలిపారు. శనివారం వి.ఎల్.పురంలోని తన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రాజన్న రచ్చబండ కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిధ సమస్య పరిష్కారం కోరుతూ పలువురు ప్రజలు ఎంపీకి అర్జీలు అందజేశారు. జీఎస్ఎల్ మెడికల్ కళాశాల ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై 150 మంది వైద్య విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఎంపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఎన్హెచ్ఏఐ అధికారులతో ఫోన్లో మాట్లాడి సోమవారం నుంచి పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పింఛను మంజూరు చేయించినందుకు వృద్ధకళాకారుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను సత్కరించారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఈ మేరకు శనివారం 43వ డివిజన్లో పర్యటించారు. కాలువలు, రోడ్లు పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరును నివాసితులను అడిగి తెలుసుకున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







