UPDATED 8th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలను నాక్ కౌన్సిల్ బృందం సందర్శించనున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ సంస్థ చెందిన ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు నాక్ గుర్తింపు కొరకు దరఖాస్తు చేయగా కళాశాల విద్యా, మౌలిక సదుపాయాల కల్పనలో విద్యాసంస్థలకు ఇచ్చే అక్రిడేషన్ పరిశీలించిన అనంతరం నాక్ గుర్తింపు కొరకు సిఫార్సు చేయడానికి ఈ బృందం ఈ నెల తొమ్మిదిన కళాశాలను సందర్శించనున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు.







