రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ధవళేశ్వరంలోని జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉభయ గోదావరి జిల్లాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (IAB) సమావేశాన్ని ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలోని వివేకానంద హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో నీటి లభ్యత, సాగు ఆయకట్టుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. అనంతరం ఆయన్ని జలవనరుల శాఖ అధికారులు సత్కరించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







