పెద్దాపురం,20 జూలై 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మీడియా హౌస్ ఎన్నిక కార్యక్రమం స్థానిక మానోజీ చెరువు సమీపంలో ఉన్న తాపీమేస్త్రి అండ్ వర్కర్స్ యూనియన్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడుగా సీనియర్ పాత్రికేయుడు ఆకుల మురళీకృష్ణ, అధ్యక్షుడుగా దేవరకొండ సుధాకర్, ఉపాధ్యక్షుడుగా సిద్దు, ప్రధాన కార్యదర్శిగా బూరాడ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా పేపకాయల సూరిబాబు, సహాయ కార్యదర్శిగా ఐతి విల్సన్ రాయ్ (చింటూ), కోశాధికారిగా పెనుమత్స శ్రీధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.రెడ్డి, కడలి ప్రభుదాస్, లింగం అశోక్ కుమార్, తోట సూర్యారామకృష్ణ,
కరెడ్ల రాజా, మాసా చంద్రరావు (చందు), ఎండి.ఇర్షాద్ ఆలీ, వీరకుమార్, బాలు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియచేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







