దేవాస్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: సాధారణంగా మేకలు శాకాహార జంతువులు. చెట్ల ఆకులు, కూరగాయలు, ధాన్యం తిని బతుకుతాయి. మధ్యప్రదేశ్లోని దేవాస్ పట్టణ సమీపాన లోహారి గ్రామ రైతు రఫీఖ్ పెంచుతున్న మేక ‘భూరి’కి మాత్రం రోజూ చికెన్ బిరియానీ కావాల్సిందే. చెట్ల ఆకుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విషయం తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న జనం ఓ వింతలా ఈ మేకను చూసి పోతున్నారు. రఫీఖ్ తన పొలంలో ఆవులు, గేదెలు, మేకలు పెంచుతున్నారు. వీటిలో ‘భూరి’ ప్రత్యేకం. మాంసాహారమంటే తెగ ఇష్టపడే ఈ మేక.. చికెన్, మటన్, చేప, గుడ్లు ఏదైనా గుటుక్కుమని తినేస్తుంది. ‘మా పొలంలో పుట్టిన ‘భూరి’ని చిన్నప్పటి నుంచీ పెంచుతున్నా. మూడేళ్లుగా మాంసాహారం తింటోంది. చికెన్ రోజూ కావాల్సిందే’ అని రఫీఖ్ తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







