గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలని మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు సూచించారు. మండలంలోని కొత్తాడలో కస్తూర్భా బాలికల విద్యాలయం, చిన్నగార్లపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులు హాజరు తక్కువ ఉండడాన్ని గమనించిన ఆయన నూరు శాతం హాజరు ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే వసతి గృహంలో స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి పద్మావతి, సీఆర్పీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







