కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది వెంటనే స్పందించాలని, ప్రమాద రహిత జిల్లా లక్ష్యంగా చేసుకోవాలని ఎస్పీ రవీంద్రనాథ్బాబు సూచించారు. జిల్లాలోని అధికారులు, సిబ్బందికి ఐఆర్ఏడీ యాప్పై అవగాహన, రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాత్రులకు అందించే ప్రథమ చికిత్స, సీపీఆర్లపై వారం రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిసింది. 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఐఐటీ చెన్నై, భారత రహదారులు మంత్రిత్వశాఖ, ఎన్ఐసీఎస్ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన ఐఆర్ఏడీ యాప్పై అవగాహన కల్పించారు. జీజీహెచ్ ఆర్ఎంవో డా.సుధీర్, డా.నూకరాజు సీపీఆర్ విధానాలపై అవగాహన కల్పించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటబుద్ధ, డా.ఎస్ఎస్సీ చక్రరావు, వి.వెంకట్, జీవీ రామారావు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







