UPDATED 8th JULY 2022 FRIDAY 05:00 PM
జగ్గంపేట (రెడ్ బీ న్యూస్): జగ్గంపేట తహసీల్దార్గా బూసి శ్రీదేవి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పెద్దాపురం తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన వై. సరస్వతి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయ ఏవోగా బదిలీ కావడంతో ఆమె స్థానంలో ఈమె ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీదేవి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ శ్రీదేవిని మండలంలోని వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.







