UPDATED 25th OCTOBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట గోదావరి కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సామర్లకోట ఎస్ఐ సుమంత్ తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలకు ఒక మహిళ మృతదేహం గోదావరి కాలువలో కొట్టుకు వచ్చిందని అన్నారు. మృతురాలి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఆమెవద్ద ఇంక ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.







