జనసేన అధ్యక్షుడిగా సిద్ధూ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: జనసేన పార్టీ గంగవరం మండల కమిటీ అధ్యక్షుడిగా కుంజం సిద్దు నియమితులయ్యారు. రంపచోడవరం నియోజకవర్గం లో పార్టీ పటిష్టత కోసం అధిష్టానం మండల కమిటీలను నియమించింది. దీనిలో భాగంగా గంగవరం మండలానికి సిద్ధూ ఎన్నికయ్యారు. మండలంలో పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. తనకు బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జిల్లా కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us