అమరావతి:4 జనవరి 2021(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని వేదవిశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంను దాడులకు పరాకాష్ఠగా చినజీయర్ పేర్కొన్నారు. దాడులు జరిగిన ఆలయాలను సందర్శించి రక్షణ విషయంలో తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యల గురించి స్థానికులతో చర్చిస్తామని తెలిపారు. ఆలయాల పట్ల శ్రద్ధ ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్వామి పిలుపునిచ్చినట్టు వికాస తరంగణి సంఘటన కార్యదర్శి శ్రీకార్యం భవానీప్రసాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







