గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: తరగతిలో విద్యా ప్రమాణాల స్థాయిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు ఆదేశించారు. స్థానిక ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలో రికార్డులను తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించారు. ఇంగ్లీష్, లెక్కలు, తెలుగు సబ్జెక్టులలో పలువురు విద్యార్థులు వెనుకబడి ఉండడంతో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం సమకూర్చిన మధ్యాహ్న భోజనాన్ని ఆయన స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు జరుగుతోందా లేడా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహంలోని స్టోర్ రూమ్, మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు ఆర్.వి.వి సత్యనారాయణ వసతి గృహ సంక్షేమాధికారి ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







