హిందూపురం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: పట్టణం: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయకపోవడాన్ని నిరసిస్తూ హిందూపురం పట్టణంలో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని ఎస్వీ థియేటర్ యాజమాన్యం శుక్రవారం తెల్లవారుజామున ‘పుష్ప’ బెనిఫిట్ షో వేస్తామని టికెట్లు విక్రయించింది. దాంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకొని టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ఎంతసేపటికీ షో ప్రారంభం కాకపోవడంతో వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షో ప్రారంభించాలంటూ థియేటర్లో నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని.. బెనిఫిట్ షో రద్దు చేస్తున్నామని థియేటర్ నిర్వాహకులు ప్రకటించడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. థియేటర్పై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీఛార్జీ చేశారు. థియేటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







