వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

UPDATED 30th DECEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట విత్తనాభివృద్ధి, అనుసరణీయ పరిశోధనా  ప్రాంగణంలో రూ.163.30 లక్షలతో నూతనంగా నిర్మించిన జీవన ఎరువుల తయారీ కేంద్రం, రూ.60 లక్షలతో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రం ప్రారంభించిన అనంతరం రూ.40 లక్షల వ్యయంతో  నిర్మించనున్న ప్రహారీగోడకు హోంమంత్రి చినరాజప్ప, ఎంఎల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి ఆదివారం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రైతులు జీవన ఎరువులు ఉపయోగించడం ద్వారా రసాయనిక ఎరువులు భారం తగ్గుతుందని, అలాగే  జీవన ఎరువులు వల్ల మనిషికి మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అన్ని శాఖల కార్యాలయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పొలాలకు కాలువలు, సాగునీరు, రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. ఈ పరిశోధనా క్షేత్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి కె.ఎస్. ప్రసాద్, ఎంపిపి ఎ. సత్తిబాబు, సామర్లకోట, పెద్దాపురం ఏఎంసి చైర్మన్లు పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాల రాజబ్బాయి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, మన్యం చంద్రరావు, కంటే జగదీష్ మోహన్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, గుమ్మళ్ళ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us