UPDATED 31st JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: ఇటీవల మృతి చెందిన ఒకటవ వార్డు కౌన్సిలర్ కరికం గోపాలం కుటుంబ సభ్యులను మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలం అందించిన సేవలు మరువలేనివని, ఆయన లోటు తీర్చలేనిదని అన్నారు. గోపాలం కుటుంబాన్ని పరామర్శించిన వారిలో గోలి రామారావు, పాగా సురేష్ కుమార్, తదితరులు ఉన్నారు.







