స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి

* మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు

UPDATED 29th JULY 2019 MONDAY 9:00 PM 

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం స్పందన అర్జీలపై  ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతీ అర్జీని నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కారం చూపాలని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. అర్జీలను ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ మంజూరు కోరుతూ రెండు దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, ఎస్సై సుమంత్, మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, మున్సిపల్ మేనేజర్ అచ్యుతరాజు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us