పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పౌష్టికాహారంతోనే తల్లీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. మండల కేంద్రమైన గంగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనా ఆమె మాట్లాడుతూ ఏడో నెల నుండి బిడ్డకు ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర వివరాలను వివరించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు, బాలామృతం, గుడ్లు చిన్నారులకు తప్పనిసరిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, సర్పంచ్ అక్కమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us