UPDATED 22nd JUNE 2020 MONDAY 10:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం డీఎస్పీగా పనిచేస్తున్న అరిటాకుల శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా డిఎస్పీలకు సర్వీస్, సీనియారిటీలను పరిగణనలోకి తీసుకుని అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ హోం శాఖ సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. దీని ప్రకారం శ్రీనివాసరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన పదోన్నతిపై బదిలీ కానున్నారు.







