UPDATED 5th MAY 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: కౌశల్ గోదావరి పథకం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఏ.పి.ఎస్.డి.సి. మేనేజర్ ప్రశాంత్ అన్నారు. ఆజీవికా ఈవం కౌశల్ వికాస్ దివస్ ను పురస్కరించుకుని స్థానిక టిటిడిసి ఆవరణలో గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణా తరగతుల సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమానికి పలువురు శిక్షణార్థులు శనివారం హాజరై సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్స్ అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నాగదుర్గ, కౌశల్ గోదావరి పిడి చంద్ర, జిల్లా జాబ్స్ మేనేజర్ సంపత్ కుమార్, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







