UPDATED 1st MARCH 2018 THURSDAY 6:00 PM
సామర్లకోట: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెద్దాపురం సామర్లకోట పట్టణాల కళాశాలలకు చెందిన సుమారు 460 మంది విద్యార్థులకు 13 మంది హాజరు కాలేదని పరీక్షల చీఫ్ సూపరెండెంట్ లీలాకుమారి తెలిపారు. ప్రతీ తరగతి గదిలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.







