UPDATED 9th MARCH 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట పట్టణం స్థానిక ఇందిరాకాలనీలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు మాట్లాడుతూ వీధి కుళాయిల నుంచి నీరు సక్రమంగా రావడం లేదని, వేసవికాలం రావడంతో నీటికోసం దూరప్రాంతాలకు మహిళలు నడిచి వెళ్లి మంచినీళ్లు పట్టుకోవాల్సి వస్తోందన్నారు.







