గంగవరం:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): కొమరవరం ఎమ్.పీ.పీ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ప్రమాదవశాత్తు కంటిచూపు కోల్పోయిన పండా అంజిబాబు దొర అనే గిరిజన విద్యార్థికి గంగవరం మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఆర్ధిక సహాయం గురువారం అందించారు.ఆ మొత్తాన్ని విద్యార్థి వైద్య ఖర్చులు నిమిత్తం రూ.31500 ను విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల కమిటి చైర్మన్ పండా రాజన్న దొర, పాఠశాల ఉపాధ్యాయురాలు మడకం తులసి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణతో కలిసి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యార్థి వైద్య ఖర్చులకు వినియోగించాలని వారు సూచించారు. మండలంలోని ఉపాధ్యాయులు బృందానికి విద్యార్థి తల్లిదండ్రులు, చైర్మన్ రాజన్న దొర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనాడు పాత్రికేయ మిత్రుడు నండూరి రమేష్ కూడా ఈ విద్యార్థికి కొంత ఆర్థిక సహయాం అందచేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ యూటీఎఫ్ ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాల్లో ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు రాంబాబు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







