UPDATED 25th JANUARY 2021 MONDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : ఇంటింటికీ బియ్యం పంపిణీకి సంబంధించి మొబైల్ డిస్పాచింగ్ యూనిట్ సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో ఎస్. మల్లిబాబుకు సోమవారం వినతి పత్రం అందచేశారు. గ్రామ, వార్డుల వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తామని చెప్పి ఇప్పుడు ఎండీయూలతో పంపిణీ చేయించడం ఏంటని వారు ఆర్డీవోకు విన్నవించారు. బయోమెట్రిక్ తూకాలు వేసే బాధ్యతల నుంచి తమను తప్పించాలని వారు ఈ సందర్భంగా ఆర్డీవోను కోరారు.







