UPDATED 9th MARCH 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ బృందం శుక్రవారం పర్యటించారు. చీఫ్ ఇంజనీర్ రవీంద్ర ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ డిఇ, ఏఈలు పాల్గొని గ్రామంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వర్మీ కంపోస్ట్ తయారీ, పచ్చదనం- పరిశుభ్రత, తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పబ్బినీడి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







