UPDATED 16th AUGUST 2018 THURSDAY 9:00 PM
పెద్దాపురం: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్ పాయ్ అజాత శత్రువుగా రాజకీయాల్లో రాణించారని, ప్రజాసేవలో దశాబ్దాల పాటు సేవలందించిన రాజనీతిజ్ఞుడన్నారు. ఆయన మరణంతో దేశం ఒక మేధావి, మహనీయుడిని కోల్పోయిందన్నారు. వాజ్ పాయ్ కుటుంబసభ్యులకు హోంమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.







