వాల్మీకీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం వర్తింపు : అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి

గంగవరం:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వాల్మీకీ కులస్తులకు ఆన్ లైన్ లో కుల ధృవీకరణ పత్రాలు లేకపోయానా వైఎస్సార్ చేయూత పథకం వర్తింప చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి స్పష్టం చేశారు.ఈసందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ వాల్మీకీ కులదృవీకరణ పత్రాలు మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాల్మీకి మహిళలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని వర్తింప చేయాలని సీఎంను కోరడం జరిగిందన్నారు. ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారని, వాల్మీకులు కుల ధృవీకరణ పత్రాలు లేకపోయినా వైఎస్సార్ చేయూత పథకానికి ధరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us