సామర్లకోట: 25 జూలై 2020( రెడ్ బీ న్యూస్):
సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద కౌలు రైతులకు వ్యవసాయ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండల వ్యవసాయ అధికారి ఐ. సత్య అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు హక్కు పత్రం ద్వారా సాగుదారునికి భూమిపై ఎలాంటి హక్కులు లభించవని, కేవలం పంట రుణం, పంట బీమా, సబ్సిడీ పథకాలు,ప్రభుత్వ పరంగా సంబంధిత శాఖ నుంచి అందే సౌలభ్యాలు మాత్రమే సాగు దారు పొందవచ్చన్నారు. పంట సాగు దారు కార్డు కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే హనంటుందన్నారు.మళ్లీ కొత్త కార్డు పొందవలసి ఉంటుంది అని తెలియచేశారు. భూయజమానులకు పూర్తిస్థాయిలో నమ్మకం కలగడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు..
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







