ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన భారత తొలి విమానవాహక నౌక (ఐఏసీ) విక్రాంత్.. ఆదివారం మరో విడత సముద్ర పరీక్షలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఇది సాగరంలో సంక్లిష్ట విన్యాసాలు నిర్వహిస్తుంది. ఆగస్టులో లాంఛనంగా ఇది నౌకాదళంలో చేరనుంది. 40 వేల టన్నుల బరువుండే విక్రాంత్.. భారత్ నిర్మించిన యుద్ధ నౌకలన్నింటిలోకీ అత్యంత సంక్లిష్టమైంది. రూ.28 వేల కోట్లతో కొచ్చిన్ షిప్ యార్డ్ దీన్ని రూపొందించింది. దీంతో ఈ సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. గత ఏడాది ఆగస్టులో ఈ యుద్ధనౌక తొలిసారిగా ఐదు రోజుల పాటు సముద్ర పరీక్షలకు బయలుదేరింది. గత అక్టోబరులో 10 రోజుల పరీక్షలు పూర్తి చేసుకుంది. మూడో విడత ప్రయోగాలను నేవల్ సైన్స్ అండ్ టెక్నోలాజికల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఈ యుద్ధనౌకపై మిగ్-29కే యుద్ధ విమానాలు, కామోవ్-31 హెలికాప్టర్లు, ఎం హెచ్-60 ఆర్ బహుళ ప్రయోజన హెలికాప్టర్లను మోహరించనున్నారు. 2300 కంపార్ట్ మెంట్లతో కూడిన విక్రాంత్ లో 1700 మంది సిబ్బంది ఉంటారు. మహిళా అధికారుల కోసం ప్రత్యేక వసతులను కల్పించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







