UPDATED 13th OCTOBER 2018 SATURDAY 6:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఫ్రొఫెసర్ ఎం. అంజిబాబు కాకినాడ జెఎన్టీయుకె నుంచి డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ అంజిబాబు సమర్పించిన Free Vibration Analysis of Rectangular and Elliptical with Cutouts అనే థీసిస్ కు డాక్టరేట్ లభించిందని తెలిపారు. జెఎన్టీయుకె ప్రొఫెసర్స్ డాక్టర్ ఎన్. మోహనరావు, డాక్టర్ వి.వి. సుబ్బారావుల పర్యవేక్షణలో ఈ పి.హెచ్.డి పూర్తి చేసినట్లు డాక్టర్ అంజిబాబు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజిబాబును ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు.







