సామర్లకోట:15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): సొంత భూమి గల రైతులందరూ కౌలు రైతులకు కార్డులు అందించేందుకు ఊతమివ్వాలని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్ కోరారు. వేట్లపాలెం రైతు భరోసా కేంద్రాల్లో పంటల సాగు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని సోమవారం మాట్లాడారు. పంట సాగు హక్కు పత్రం ద్వారా ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, పంట రాయితీ, పంటలకు ప్రభుత్వ మద్దతు ధర అందించే అవకాశాలు ఉంటాయన్నారు. పంట సాగు పత్రం ద్వారా 11 నెలల కాలపరిమితి వరకే కౌలు రైతులకు పంటలపై హక్కు కల్పించామని, భూమి మీద ఏ విధమైన హక్కులు ఉండవని స్పష్టం చేశారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర సదుపాయాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీకే జిల్లా కోఆర్డినేటర్ మాధవరావు, ఏడీఏ పద్మశ్రీ, నోదల ఆఫీసర్ వజ్రపు జితేంద్ర, ఏవో ఐ. సత్య రైతులు పాగొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







