UPDATED 24th JUNE 2019 MONDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరు ఆర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు తెలిపారు. వీటిలో పట్టాదారు పాస్ పుస్తకం గురించి, దారి సమస్య పరిష్కరించమని, పంట కాలువ మూసివేస్తున్నారని, శ్మశానం ఆక్రమణలకు గురవుతుందని, రోడ్డు సమస్య పరిష్కరించమని, స్వాతంత్ర సమర యోధుడు రుణం ఇప్పించమని అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







