UPDATED 16th NOVEMBER 2022 WEDNESDAY 9:25 PM
Kanika Tekriwal : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాఫ్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈసారి కనికా టేక్రివాల్ అనే మహిళ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కనికా టేక్రివాల్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి భార్య. ఈమెకు జెట్ సెట్ గో పేరుతో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఉంది. ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా అద్దెకు తీసుకునే విమానాలు, చార్టర్డ్ ఫ్లైట్లు ఈ కంపెనీనే సమకూరుస్తుందని తెలుస్తోంది.
ఈ స్కామ్ కి సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ద్వారా కీలక సమాచారం సేకరించింది ఈడీ. శరత్ చంద్రా రెడ్డి భార్య కనికా టేక్రివాల్ కి చెందిన జెట్ సెట్ గో విమానాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బును హైదరాబాద్ కు తరలించినట్లుగా గుర్తించింది ఈడీ. దీంతో జెట్ సెట్ గో విమాన సర్వీసులు, అందులో ప్రయాణించిన వారిపై ఈడీ నజర్ పెట్టింది. ఆ వివరాలు సేకరించే పనిలో పడింది.
ఈ క్రమంలో కనికా టేక్రివాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరీ కనికా టేక్రివాల్? జెట్ సెట్ గో ను ఎప్పుడు స్థాపించింది? ఏ విధంగా ఆమె సక్సెస్ అయ్యింది? ఆమె లైఫ్ జర్నీ ఏంటి? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకునే సత్తా కూడా ఉండాలి. అది కొందరికే సాధ్యం. అలాంటి కోవకే వస్తారు భోపాల్కు చెందిన కనికా టేక్రివాల్. 33ఏళ్ల వయసుకే 10 చార్టర్డ్ ఫ్లయిట్స్కు ఆమె ఓనర్ అయ్యారు. పదేళ్ల క్రితం ఆమె స్థాపించిన ‘జెట్సెట్గో (JetSetGo)’ విమానయాన సంస్థ నికర విలువ రూ. 420 కోట్లు. ఓ సంస్థ విడుదల చేసిన ‘దేశంలోనే అత్యంత సంపద కలిగిన 100 మంది మహిళల జాబితా’లో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది టేక్రివాల్.







