UPDATED 20th DECEMBER 2020 SUNDAY 8:30 PM
దేవీపట్నం (రెడ్ బీ న్యూస్): అంగుళూరు గ్రామంలో పోలవరం ప్రాజెక్టు పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ సభ్యులు పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర అయ్యర్, డి.గణేష్ కుమార్, డీడీ పీపీఏ కె. లలిత, తదతరులు ప్రాజెక్టు పనులను ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, గ్యాప్-1, గ్యాప్-2, ఈసీఆర్ఎఫ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎం.నాగిరెడ్డి, మెగా ఇంజనీరింగ్ సంస్థ జీఎం సతీష్ బాబు అంగర, ముద్దుకృష్ణ, ఏజీఎం రాజేష్, క్రాంతికుమార్, మేనేజర్ మురళి, తదితరులు పాల్గొన్నారు.







