గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటిపల్లి ఆశ కార్యకర్త చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఐటీడీఏ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వెదుళ్ళ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని లచ్చిరెడ్డి సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్యం కాపాడే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ, చెల్లాయమ్మ గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







