UPDATED 15th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పథకాలపై మహిళా సంఘాల ప్రతినిధులు అవగాహన పెంపొందించుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వాటి ప్రయోజనాల గురించి మిగిలిన సభ్యులకు తెలియజేయాలన్నారు. మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆయా గ్రామాలకు వెళ్లి శిక్షణలో నేర్చుకున్న విషయాలను తెలియజేసి, ప్రతి గ్రామంలో వర్మి కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు వెంకట్రావు, గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.







