విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడాలని మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని నెల్లిపూడిలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, భవిత కేంద్రాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండడంతో నూరు శాతం హాజరు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుని ఆదేశించారు. అనంతరం 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించగా పలువురు విద్యార్థులు వెనుకబడి ఉండడంతో వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us