గంగవరం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడాలని మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని నెల్లిపూడిలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, భవిత కేంద్రాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండడంతో నూరు శాతం హాజరు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుని ఆదేశించారు. అనంతరం 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించగా పలువురు విద్యార్థులు వెనుకబడి ఉండడంతో వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







