ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. సంక్రాంతి, కనుమ పండుగలలో వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖద్వారం వద్ద పుష్పాలతో అలంకరించారు. గోవిందనామస్మరణతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రెండ్రోజుల్లో స్వామివారికి లభించిన ఆదాయం రూ.7,81,970 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







