గంగవరం (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : ఏజెన్సీలోని మెటల్ క్వారీలు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. బుధవారం గంగవరం మండలం జగ్గంపాలెంలో ప్రభుత్వానికి సంబంధించిన క్వారీని పీవో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ దుర్గ మెటల్ క్వారీని కారం బాపనమ్మతో పాటు మొత్తం 12 మంది సభ్యులు ఈ క్వారీని లీజ్ ద్వారా నిర్వహిస్తున్నారని, ఈ లీజ్ కాలం ముగియడంతో తిరిగి మా సంఘానికి ఈ లక్ష్మీ దుర్గ క్వారీ మాకు లీజుకు ఇవ్వాలని బాపనమ్మ పాటు గిరిజనులు పీవోకి వివారించారు. ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి క్వారీలకు క్రషర్, జేసీబీ, ట్రాక్టర్, లారీ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయుటకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ లీజ్ తీసుకున్నవారు వివిధ సైజులలో ఈ క్రషర్ ద్వారా కట్ చేసే విధంగా లీజ్ దారులు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, ఎంపీడీవో జాన్ మిల్టన్, మైనింగ్ ఏడీ శ్రీనివాస రావు, డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, ఆర్ఐ. జిలాని, వీఆర్వో సత్యనారాయణ, సర్పంచ్ తుర్రం లీలావతి, ఎంపీటీసీ సభ్యురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







